మేడ్చల్ : రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేయర్లు, చైర్ పర్సన్లపై సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లే తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై సొంతపార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మర్రి దీపికపై కౌన్సిలర్లు తిరుగుబాటుబావుటా ఎగరేశారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి మేడ్చల్ కలెక్టరేట్ ఇన్ వర్డ్ లో అందజేశారు. ఎంతో నమ్మకంతో ఛైర్ పర్సన్గా ఎన్నుకుంటే ఆమె అవినీతికి పాల్పడుతోందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవిశ్వాసం విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని చర్చలు జరిపినా వెనక్కి తగ్గకపోవడం విశేషం.
మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్పై అవిశ్వాసం
- రంగారెడ్డి
- January 31, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.