మహిళా డాక్టర్​పై దాడి.. ముంబైలో ఇద్దరి అరెస్టు

ముంబై: కోల్​కతాలో మహిళా డాక్టర్​పై జరిగిన అఘాయిత్యంపై డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా.. తాజాగా ముంబైలో ఓ లేడీ డాక్టర్​పై  దాడి జరిగింది. లోకమాన్య తిలక్  మునిసిపల్ జనరల్  హాస్పిటల్  అండ్  మెడికల్  కాలేజీలో విధుల్లో ఉన్న డాక్టర్​పై రోగి బంధువులు దాడి చేశారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 

దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చెవికి గాయంతో ఆసుపత్రికి వచ్చిన రోగి.. చికిత్స చేస్తుండగా డాక్టర్​ను దుర్భాషలాడడంతో పాటు వెంట వచ్చిన బంధువులతో కలిసి దాడి చేశాడు. దీంతో వైద్యురాలికి గాయాలయ్యాయని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.