చత్తీస్​గఢ్ ఎన్​కౌంటర్​లో మావోయిస్టు హతం

  • చత్తీస్​గఢ్ లోని సుక్మా జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు :  చత్తీస్​గఢ్​ లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతిచెందాడు.  కిష్టారం పోలీస్​స్టేషన్​ పరిధిలోని డబ్బికొంట, ఎంటపాడు, బుర్కలంక, పాములూరు, సింగనమడుగు గ్రామ అడవుల్లో రెండు రోజుల నుంచి డీఆర్ జీ, బస్తర్ ఫైటర్స్, 206,208 బెటాలియన్లకు చెందిన కోబ్రా, 131 బెటాలియన్​ సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూంబింగ్​ నిర్వహిస్తున్నారు.

పాములూరు గుట్టల్లో కూంబింగ్​ చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురు పడగా ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. మావోయిస్టులు పారిపోగా సంఘటనా స్థలంలో కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేశ్​ మృతదేహం దొరికింది. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్​ కొనసాగుతుంది.

ఇన్​ఫార్మర్​ పేరుతో గిరిజనుడి హత్య చేసిన మావోయిస్టులు

ఇన్​ఫార్మర్​ పేరుతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్​గఢ్ లో జరిగింది. బీజాపూర్​జిల్లాలోని భూపాల్​పట్నం పోలీస్​స్టేషన్ పరిధిలోని పోశనపల్లిలో గిరిజనుడు తాటి కన్నయ్యతో మాట్లాడేది ఉందంటూ మంగళవారం అతడిని ఇంట్లోంచి సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు.

అక్కడ ప్రజాకోర్టు పెట్టి 15 ఏండ్లుగా పోలీసులకు ఇన్​ఫార్మర్​గా వ్యవహరిస్తున్నాడంటూ అభియోగం మోపారు. దళాల సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడంటూ ఒప్పించారు. అనంతరం దారుణంగా కొట్టి, కత్తులతో పొడిచి హత్య చేశారు. మావోయిస్టుల పేరుతో తాటి కన్నయ్య ఇన్​ఫార్మర్​గా పని చేస్తున్నా డంటూ లేఖను సంఘటనా స్థలంలో వదిలి వెళ్లారు.