జార్ఖండ్లో రైల్వేట్రాక్​ పేల్చేసిన దుర్మార్గులు

జార్ఖండ్​లోని గొడ్డా జిల్లాలో ఫరక్కా లాల్మాటియా మధ్యలో రైల్వేట్రాక్​ను పేల్చేశారు గుర్తుతెలియన దుండగులు. ట్రాక్ పై పేలుడు పదార్థాలు ఉంచి పేల్చడంతో ట్రాక్ పై మూడు అడుగుల గుంత ఏర్పడింది. ట్రాక్​ పట్టాలు తెగిపోయాయి. బుధవారం(అక్టోబర్2) జరిగిన ఈ ఘటన వెనక క్రిమినల్​గ్యాంగ్​హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

లాల్మాటియా నుంచి ఫరక్కా వెళ్లే  ఎంజీఆర్ రైల్వే లైన్లో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత ఈ మార్గంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటివరకు  ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు చెప్పారు.  

Also Read :- వరద సహాయ చర్యలకు వెళ్లి నదిలో ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్​​

అయితే ఇది ఇండియన్ రైల్వే నెట్​ వర్క్​ లో భాగంగా కాదు. ఇది గొడ్డాస్​ లాల్మాటియా నుంచి పశ్చిమ బెంగాల్​లోని ఫరక్కాలోని పవర్​ స్టేషన్​ వరకు బొగ్గు రవాణా కోసం NTPC ఏర్పాటు చేసిన ట్రాక్​ ఇది. పేలుడు ధాటికి 470 సెంటీమీటర్లు ట్రాక్​ విరిగి పోయిందని పోలీసులు గుర్తించారు. కొందరు దుండగులు పేలుడు పదార్థాలు అమర్చి రైల్వే ట్రాక్​ ను పేల్చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.