- కస్టమ్స్ డ్యూటీని సవరించిన కేంద్రం
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, వెలుగు: బియ్యం దిగుమతుల కోసం కస్టమ్స్ డ్యూటీని సవరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన కస్టమ్స్ డ్యూటీ వెంటనే అమలులోకి రానుంది. సవరించిన దిగుమతి సుంకాల ప్రకారం పొట్టు బియ్యం పై 10 శాతం, బ్రౌన్ రైస్పై 10 శాతం, పారా బాయిల్డ్ రైస్పై 10 శాతం దిగుమతి సుంకం వసూలు చేయనున్నారు.
పారా బాయిల్డ్ బాస్మతీ బియ్యంపై సున్నా శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం ప్రకటించింది. కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 25(1) ప్రకారం ఈ మార్పులను ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నోటిఫికేషన్ తక్షణం అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బియ్యం దిగుమతిదారులు, దేశీయ మార్కెట్ రెండింటిపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.