సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఓనర్ పేరు, ఫోన్ నంబర్తో పాటు అతడి అడ్రస్.. తప్పనిసరిగా కస్టమర్లకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిమ్లాలో జరిగిన రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
కాగా, ఈ అంశంపై ఇటీవల స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా.. ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు విక్రమాదిత్య సింగ్తో పాటు అనిరుధ్ సింగ్ కూడా ఉన్నారు. కమిటీ భేటీ సందర్భంగా విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. హాకర్లకు ఐడీ కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ తరహా ఆదేశాలు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా జారీ చేసింది.
హోటళ్ల యజమానులు, ఆపరేటర్లు, మేనేజర్ల పేర్లు కస్టమర్లకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.