21 రోజుల్లో ఫిర్యాదులపరిష్కారం

  • 30 రోజుల నుంచి 21కి గడువు కుదింపు 
  • కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ
  • ఫిర్యాదుల నమోదుకు సీపీజీఆర్​ ఏఎంఎస్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ ఫామ్​
  • అన్ని మంత్రిత్వ శాఖలకు నోడల్​ ఆఫీసర్లు
  • కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార గడువును 30 రోజులనుంచి 21 రోజులకు కుదించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న సందర్భాల్లో, ప్రజలకు మెసేజ్​ద్వారా విషయాన్ని తెలియజేయాలని  నిర్ణయించింది.  సింగిల్ విండో ఓపెన్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా పనిచేసే ఇంటిగ్రేటెడ్ యూజర్ ఫ్రెండ్లీ సీపీజీఆర్​ఏఎంఎస్ www.pgportal.gov.in పోర్టల్‌‌‌‌లో ప్రజలు దాఖలు చేసిన ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్రం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది.

అలాగే, పరిష్కరించిన ఫిర్యాదులపై ఫీడ్​బ్యాక్​ను ప్రజలకు ఎస్​ఎంఎస్​, ఈమెయిల్​ ద్వారా చేరవేస్తారు. కాల్​సెంటర్​ ద్వారా ఫీడ్​బ్యాక్​ సేకరిస్తారు. ఒకవేళ ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందకపోతే సీనియర్​ అధికారికి అప్పీల్​ చేసుకోవచ్చు. 

కొత్త మార్గదర్శకాలివే..

  • అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రజా ఫిర్యాదుల కోసం నోడల్ అధికారులను నియమిస్తారు. వారు ప్రజా ఫిర్యాదులను తక్షణమే, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఫిర్యాదులు అధికంగా ఉన్న మంత్రిత్వ శాఖలు, శాఖలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు ఉండాలి.
  • ప్రతి మంత్రిత్వ శాఖలో స్కీమ్స్, కార్యకలాపాలపై అవగాహన, తగిన వనరులతో కూడిన ప్రత్యేక గ్రీవెన్స్​ సెల్స్​ను ఏర్పాటు చేయాలి. 
  • మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అప్పిలేట్​ ఆఫీసర్లు, సబ్​ నోడల్​ అప్పిలేట్​ఆఫీసర్ల అంచెలవారీగా నియామక ప్రక్రియను రూపొందించారు.
  • ఫిర్యాదుల పరిష్కారం మొత్తం ప్రభుత్వ విధాన పరిధిలోనే ఉంటుంది. తీసుకున్న చర్యలపై నివేదికను రిడ్రెస్సల్​ అధికారులు సీపీజీఆర్ఏఎంఎస్​లో దాఖలు చేయాలి.
  • ప్రజా ఫిర్యాదులను ఏఐ ఆధారిత టీ డ్యాష్ ​బోర్డ్, ఇంటెలిజెంట్​ గ్రీవెన్స్​ మానిటరింగ్​ డ్యాష్​ బోర్డును ఉపయోగించి అనలైజ్​ చేస్తారు.
  • నెలవారీగా మంత్రిత్వ, విభాగాల ర్యాంకింగ్​ కోసం గ్రీవెన్స్​ రీడ్రెస్సల్​ అసెస్​మెంట్​ ఇండెక్స్​ను విడుదల చేయాలి.
  •     
  • సేవోత్తమ్ స్కీమ్​ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సంస్థల ద్వారా గ్రీవెన్స్ అధికారులకు  సీపీజీఆర్ఎఎంఎస్‌‌‌‌పై శిక్షణ అందిస్తారు.