కూసుమంచి, వెలుగు: పార్టీ ఏదైనా కమ్యూనిస్టుల మద్దతు లేకుండా ఖమ్మం జిల్లాలో గెలవడం అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు, హైదర్సాయిపేట, దమ్మాయిగూడెం, కూసుమంచి మండలంలో గైగోళ్లపల్లి, పోచారం, ముత్యాలగూడెం, చేగోమ్మ, నేలపట్ల, మల్లాయిగూడెంలో ఇటీవల మృతిచెందిన పలువురిని ఆయన పరామర్శించారు. అనంతరం దమ్మాయిగూడెంలో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్తో పొత్తు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పని చేస్తామని, ఎన్నిక సమయానికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.
కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మంలో గెలవలేరు : తమ్మినేని వీరభద్రం
- ఖమ్మం
- April 9, 2023
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
