ముంబైలో వీధికి శ్రీదేవి పేరు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోఖండ్ వాలాలో ఓ వీధికి దివంగత నటి శ్రీదేవి పేరు పెట్టారు. ‘శ్రీదేవి కపూర్ చౌక్’ పేరుతో రాసి ఉన్న శిలాఫలకాన్ని ఆమె భర్త బోనీకపూర్, కూతురు జాన్వీ కపూర్  ఆవిష్కరించారు. ఆ శిలాఫలకం నలువైపులా శ్రీదేవి ఫొటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి ఫొటోకు మొక్కి బోనీ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్  నటులు షబానా అజ్మీ, అనుపమ్  ఖేర్, పూనమ్  ధిల్లాన్  పాల్గొన్నారు.

కార్యక్రమానికి సంబంధించిన వీడియోను బోనీ కపూర్  సోషల్  మీడియాలో షేర్  చేశారు. గ్రీన్  ఏకర్స్  టవర్  వద్ద ఈ చౌక్  ఉంది. ఈ టవర్స్ లోనే శ్రీదేవి కొన్నేండ్ల పాటు నివసించింది. కాగా.. శ్రీదేవి కపూర్  చౌక్ ను ప్రారంభించడంపై సోషల్  మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. వీధులకు రతన్  టాటా లాంటి లెజెండ్ల పేరు పెట్టాలి తప్ప నటుల పేర్లు కాదని కొందరు అభిప్రాయపడ్డారు.