యూపీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలం చెల్లించిన వాహనాలను(end-of-lifevehicles) రద్దు చేసేందుకు టాక్స్మినహాయింపులను ప్రకటించింది. కొత్త విధానం ద్వారా యూపీతో పాటు ఎన్ సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలను స్క్రాప్ చేస్తే 75 శాతం వరకు టాక్స్ మినహింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 11,2024 నుంచి మార్చి 10, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ పాలసీలో పాత వాహనాలపై చెల్లించని బకాయిలు ఏమైనా ఉంటే అన్నీ మాఫీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ పన్ను మినహాయింపుతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది.
యూపీ వెహికల్ టాక్స్మినహాయింపు
యూపీలో కాలం చెల్లిన వెహికల్ స్క్రాప్ కోసం టాక్స్ మినహాయింపు రూల్స్ లో భాగంగా 2003 కంటే ముందు రిజిస్టర్ చేయబడిన వెహికల్స్ రద్దు చేయబడితే వాటిపై 75 శాతం పన్ను మినహాయిం పు ఉంటుంది. 2023 నుంచి 2008 మధ్య కాలంలో నమోదు అయిన వాహనాలకు 50 శాతం పన్ను తగ్గింపు ఉంటుంది. దీంతోపాటు 2008నుంచి 2013 మధ్య శ్రీన్ సీౠర్ జిల్లాల్లో నమోదు అయిన డీజిల్ వెహికల్స్ పై కూడా 50 శాతం టాక్స్ మినహాయింపు ఉంటుంది.
ఈ పన్ను మినహాయింపు సెప్టెంబరు 11, 2024 నుండి మార్చి 10, 2025 వరకు పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆరు నెలల పాటు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లో తమ వెహికల్స్ను స్క్రాప్ చేయడాన్ని చేస్తే యజమానులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. చెల్లించని బకాయిలు మాఫీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనున్నారు.