కొవిడ్ డ్రగ్​ను విడుదల చేసిన జెనారా ఫార్మా

కొవిడ్ డ్రగ్​ను విడుదల చేసిన జెనారా ఫార్మా

హైదరాబాద్​, వెలుగు: కోవిడ్-–19 ట్రీట్​మెంట్​ కోసం వాడే డ్రగ్​ను జెనారా ఫార్మా భారతదేశంలో  లాంచ్​ చేసింది. హైదరాబాద్​కు బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇది జెనరిక్ పాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోవిడ్ (నిర్మత్రెల్విర్  రిటోనావిర్)ను అందుబాటులోకి తెచ్చింది. తేలికపాటి నుండి మోస్తరు లక్షణాలు ఉన్న కోవిడ్-19   రోగులకు ఈ ట్యాబ్లెట్లను వాడుతారు.   జెనరా ఫార్మా పాక్స్‌‌‌‌‌‌‌‌లోవిడ్​ అమ్మకాల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్​సీఓ) నుండి పోయిన నెలలో అనుమతిని పొందింది.  

'పాక్స్‌‌‌‌‌‌‌‌జెన్' బ్రాండ్ పేరుతో అమ్మే ఈ ప్రొడక్టును హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని జెనారా యూఎస్​ఎఫ్​డీఏ, ఈయూ ఆమోదిత ఫెసిలిటీలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్​ చికిత్స కోసం ఫైజర్​ తయారు చేసిన పాక్స్‌‌‌‌‌‌‌‌లోవిడ్​ను యూఎస్​ఎఫ్​డీఏ కూడా ఆమోదించింది. పాక్స్​లోవిడ్​ డబ్బా ధర రూ. 5,200  ఉంటుంది. ఒక్కోదాంట్లో 150 ఎంజీ  నిర్మాత్రెల్విర్ ​20 టాబ్లెట్లు,  పది రిటోనావిర్ 100 ఎంజీ టాబ్లెట్లు ఉంటాయని  జెనారా ఫార్మా కో–ఫౌండర్​జగదీష్ బాబు రంగిశెట్టి చెప్పారు.