సొంతరాష్ట్రానికి ఎట్ల రావాలో
తెలియక ఇబ్బంది పడుతున్నరు
సామాజిక కార్యకర్త గంగుల మురళీధర్రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ కు వెళ్లిన యువకులు అక్కడ చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని, వారిని సొంతరాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సామాజిక కార్యకర్త గంగుల మురళీధర్ రెడ్డి కోరారు. ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్లి దానిని ఎలా రియంబర్స్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. 20 నెలల క్రితం ఇఫ్కో టోకియో లో ఇన్సూరెన్స్ చేసుకొని రూ.2లక్షలు అప్పు చేసి వెళ్లారని చెప్పారు. తిరిగి వచ్చేందుకు గత నెల 26 న తనను సంప్రదించగా, తాను బాధితుల వివరాలతో 81 పేజీల డ్యాక్యుమెంట్ ను ఎంబసీ కార్యాలయానికి పంపినట్టు తెలిపారు. అధికారులు సానుకూలం గా స్పంచింది సహకరిస్తామని తెలిపారని అన్నారు.
గల్ఫ్ లో చిక్కుకున్న నగేష్ అనారోగ్యానికి గురయ్యాడని, అతన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు, బడ్జెట్ కేటాయించాలని కోరారు. గల్ఫ్ లో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రే షియా ఇవ్వాలని , విదేశాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పించాలన్నరు. వైద్య విద్య హామీలు, ఇన్సూరెన్స్, నైపుణ్యం మీద దృష్టి పెట్టాలని, మోసాలను అరికట్టి వారికి కఠిన శిక్షలు జరిమానాలు విధించే వ్యవస్థ తీసుకురావాలన్నారు. కేంద్రం లో ప్రవాసీ బిల్లు మార్పు అత్యవసరమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదన్నారు. దేశం మొత్తంలో ఎక్కువగా తెలంగాణ కు చెందిన కార్మికులే గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
