ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పోల్చారు వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. భారత్ పై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చంద్రబాబు విమర్శలు రెండూ ఒకేలా ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన ncbn వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. మూడు నెలల్లోనే సీఎం జగన్ అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడు‘ అంటూ విమర్శించారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన @ncbn వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. మూడు నెలల్లోనే @AndhraPradeshCM గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడు. @ysjagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 3, 2019
