
ప్రణాపాయంలో ఉన్న తల్లీబిడ్డలను పోలీసులు కాపాడిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు చేసిన పనికి.. ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విషయానికి వెళ్తే.. ఛతర్ పూర్ లో సారాబాయి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు ఈ రిక్షాలో హాస్పిటల్ కు తరలించారు. మార్గమధ్యలోనే సారాబాయి డెలివరీ జరిగింది. దీంతో చేసేదేమిలేక ప్రాథమిక చికిత్సకోసం.. స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
ఆ టైంలో స్థానిక హాస్పిటల్ కు తాళం వేసి ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయింది. తల్లీబిడ్డలను ఎలా కాపాడాలి అనే భయం మొదలయింది. ఛతర్ పూర్ కు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని నిర్ణయిందచుకున్నారు. అంతలోనే వాళ్లు తీసుకొచ్చిన ఈ రిక్షా మొరాయించింది.
ఏం చేయాలో తోచని స్థితి? తల్లి బిడ్డలని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో ఉండగా.. ఛతర్ పూర్ పోలీస్ స్టేషన్ నుంచి సారాబాయి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ కుల్దీప్ యాదవ్.. తమ పెట్రోలింగ్ వాహనాన్ని ఇచ్చి సారాబాయిని గౌరీపూర్ హాస్పిటల్ కు తరలించారు. దాంతో తల్లిబిడ్డలను కాపాడగలిగారు కుటుంబ సభ్యులు.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరడంతో వైరల్ అయింది. పోలీస్ అంటే ఇలా ఉండాలని.. కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.