ఈసారి రాఖీ పండుగ అర్థరాత్రి వచ్చింది.. కేవలం 10 గంటల్లోనే పూర్తవుతున్న పౌర్ణమి

ఈసారి రాఖీ పండుగ అర్థరాత్రి వచ్చింది.. కేవలం 10 గంటల్లోనే పూర్తవుతున్న పౌర్ణమి

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉంటుంది. అయితే రాఖీని శుభముహూర్తంలో కడితేనే సోదరుడికి మేలు జరుగుతుంది. భద్రకాలంలో అస్సలు రాఖీని కట్టకూడదు. ఆ సమయంలో కడితే మీ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే రాఖీ పండుగ ఎంత గొప్పదో దాన్ని జరుపుకునే సమయం అంతకంటే ముఖ్యమైనది. ఈ కారణంగా రాఖీ పండుగ విషయంలో ఈ ఏడాది గందరగోళం నెలకొంది. రాఖీపండుగ 30వతేదీనా లేక 31వ తేదీనా అనేది అర్థం కావడం లేదు. ఈ గందరగోళం తొలగించి రాఖీ పండుగ ఎప్పుడో తెలుసుకుందాం. . .

రాఖీ కట్టడానికి శుభ సమయం

ఈ సంవత్సరం రాఖీ పంండుగను ఏ రోజు జరుపుకోవాలా అనే విషయంపై జనాల్లో గందరగోళం నెలకొంది. నిజానికి రక్షాబంధన్ యొక్క శుభ సమయం ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై..ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు.

రాఖీ పండుగ

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.
 

భద్రకాలం అంటే..

భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే.ఈయన సోదరి భద్ర. ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు.

రాఖీ ఎప్పడు కట్టాలంటే..

పౌర్ణమి ప్రకారం రాఖీ పండుగ 30,31 రెండు తేదీలలో వచ్చింది. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.