నిరుడు కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారు. శ్మశానాలలో జాగా దొరకని పరిస్థితి ఎదురైంది. అలాంటి టైమ్లో మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా దేవ్రీ ఖవాసా గ్రామంలో 25 నుంచి 30 మంది దాకా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఊరోళ్లు భయపడి.. అందరూ కోలుకుంటే తలనీలాలు ఇస్తమని ‘దేవ్నారాయణ’ టెంపుల్లో మొక్కుకున్నరు. డిసెంబర్ 31న గ్రామానికి చెందిన 90 మంది ఇలా మొక్కు చెల్లించుకున్నరు. ఈ గ్రామ జనాభా 2,500 మంది. దేశంలో ఏ చిన్న ప్రాంతాన్ని వదలని వైరస్ ఆ ఊరు కూడా పాకింది. దీంతో ఊరిలో చాలామంది వైరస్ బారినపడ్డారు. అయితే ఏడాది కాలంలో కరోనాతో ఏ ఒక్కరూ చనిపోలేదు. దీంతో తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు. దేవ్నారాయణ ఆలయంలో 90 మందికిపైగా దేవుడికి సామూహికంగా తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అన్నాదాన కార్యక్రమం నిర్వహించారు. దేవుడి పాటలకు నృత్యాలు చేశారు.
