విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: రజాకార్ల అరాచకాన్ని ఎదిరించి, నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడి, తెలంగాణ గడ్డ మువ్వన్నెల జెండాను ముద్దాడిన విమోచన దినోత్సవం ఇయ్యాల. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృతికి నివాళులు అని వెంకయ్య ట్వీట్ చేశారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నిజాం మెడలువంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/tMgW6aGRdX
— Vice President of India (@VPSecretariat) September 17, 2020
