రైతులవి న్యాయమైన డిమాండ్లన్నారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. రైతులు తమకు అధికారికంగా రావాల్సిన దాని గురించే అడుగుతున్నారన్నారు. బరేలీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజలే తమకు అధికారమనే బలం ఇచ్చారన్నారు వరుణ్ గాంధీ. ఆ బలానికి అర్థం తమను తాము గొప్పగా చూపించుకోమని కాదని.. ప్రజలను కూడా గొప్పగా చూపాలని సూచించారు. కులమతాలకతీతంగా ప్రజలకు సేవ చేసేందుకే తాను వచ్చానన్నారు.
