మెదక్/మనోహరాబాద్, వెలుగు: అది దేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవే. రాత్రి పగలు తేడా లేకుండా రోజూ వేలాది వెహికల్స్ తో రూట్ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇంత ముఖ్యమైన హైవే మీద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీంతో భారీ వర్షం పడితే చాలు టెంపరరీగా నిర్మించిన అండర్ పాస్లోకి నీరు చేరి హైదరాబాద్ –- నాగపూర్ హైవేపై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గంటల తరబడి భారీగా ట్రాఫిక్ జాం అయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు రైలు సౌకర్యం కోసం సికింద్రాబాద్–- ముత్కేడ్రూట్లోని మెదక్ జిల్లా మనోహరాబాద్నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు రైల్వే లైన్నిర్మిస్తున్నారు. మధ్యలో నేషనల్ హైవే 44 అడ్డుగా ఉండటంతో రైల్వే ఓవర్బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు నాలుగేళ్ల కిందట సెంట్రల్ గవర్నమెంట్రూ. 100 కోట్లు శాంక్షన్చేసింది. సర్వే, ఎస్టిమేషన్ల తయారీ, టెండర్, అగ్రిమెంట్ ప్రాసెస్కు ఏడాది టైం పట్టింది. 2018లో ఆర్వోబీ పనులకు శంకుస్థాపన చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. మనోహరాబాద్ స్టేషన్ నుంచి గజ్వేల్వైపు రోడ్డు మీద నుంచి కొత్త రైల్వే ట్రాక్ వేశారు. ఈ క్రమంలో నేషనల్హైవే మీద నుంచి రాకపోకలు సాగించే వెహికల్స్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా మెదక్జిల్లా రామాయిపల్లి వద్ద హైవేకు రెండు వైపులా అండర్పాస్ నిర్మించారు.
వరద నీరు పోయే దారిలేక..
ఆర్వోబీ నిర్మాణం పూర్తయ్యేవరకు హైవే మీద ఇటు హైదరాబాద్, అటు నాగపూర్ వైపు రాకపోకలు సాగించే వెహికల్స్అన్నీ ఈ అండర్పాస్ నుంచే వెళ్లాలి. అయితే అధికారుల ప్లానింగ్లోపం వల్ల పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు చుట్టుపక్కల నుంచి వరద నీరు వచ్చి రామాయిపల్లి వద్ద నిర్మించిన అండర్పాస్లోకి చేరుతోంది. మనోహరాబాద్ రైల్వే స్టేషన్, రామాయిపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అండర్పాస్వైపు రాకుండా దారి మళ్లించే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ఆ పనులు చేయలేదు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా అండర్పాస్ వరద నీటితో నిండిపోతోంది. గతేడాది వానాకాలంలో ఇలాగే జరగగా, ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. కార్లు మునిగిపోయేంత లోతు నీరు నిలుస్తుండడంతో వెహికల్స్రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో రద్దీగా ఉండే 44వ నంబర్ నేషనల్హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.
స్లోగా పనులు
నేషనల్హైవే మీద చేపట్టిన ఆర్వోబీ పనులు ఇంకా పిల్లర్ల స్టేజిలోనే ఉన్నాయి. పనులు చాలా స్లోగా జరుగుతుండటంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఆర్వోబీ కంప్లీట్అయితేగానీ హైవే మీద వెహికల్స్రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోవు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్వోబీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
