
గూగుల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని టెస్ట్ చేస్తోంది. ఈ టూల్ సక్సెస్ అయితే జర్నలిస్ట్లకు ప్రమాదం అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటికే ఇండియాలో రోబో యాంకర్తో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ టూల్ వాడకంలోకి వస్తే జర్నలిస్ట్లు రాసే వార్తల్ని కూడా రాసేస్తుంది. ‘జెనెసిస్’ పేరుతో కథనాలు, వార్తలు రాసేలా ఈ టూల్ని డెవలప్ చేస్తోంది. రోజూవారీ వార్తలకు సంబంధించిన కంటెంట్ను ఈజీగా అందిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోల్లో కల్పితాలు అనేవే ఉండవు అంటున్నారు. ఈ టూల్ వల్ల టైం సేవ్ అవుతుంది. వార్తల్లో వివాదాస్పద, హానికర కంటెంట్ లేకుండా జెనెసిస్ సాయపడుతుంది అంటున్నారు కంపెనీ ప్రతినిధులు. టైంకి డాటా ఆధారంగా రిపోర్ట్లు డెవలప్ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
ఎస్ఈఓ టూల్కి కూడా ఉపయోగపడుతుంది. న్యూస్ పబ్లిషర్స్తో పార్ట్నర్గా ఉండేందుకు, చిన్న పబ్లిషర్లకు సాయం చేసేందుకు ఏఐ టూల్స్ డెవలప్ చేస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి జేన్ క్రీడర్ తెలిపారు. వార్తలను అందించేటప్పుడు ట్రూత్ వెరిఫికేషన్ కోసం ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, రచనా శైలిని మెరుగుపరచడం, ప్రత్యామ్నాయాలను అందించడంలో సాయం చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంది. అవేంటంటే... గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ చాలా రోజుల నుంచి ఎకనామిక్ రిపోర్ట్ను డిజైన్ చేయడానికి ఏఐ టూల్ని వాడుతోంది. అయితే జర్నలిస్ట్లు ప్రచురించే రిపోర్ట్ల సంఖ్య కంటే ఏఐ డిజైన్ చేసే రిపోర్ట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది. ఓపెన్ ఏఐ సంస్థ కూడా ఏఐ క్లాసిఫైర్స్ అనే టూల్ని డెవలప్ చేసింది. టీచర్లు స్టూడెంట్లకు ఇచ్చిన వర్క్ వాళ్లు చేశారా? ఏఐ వాడారా? అనేది తెలుసుకునేందుకు తయారుచేసిన టూల్ ఇది. అయితే ఇది ఏఐ రాసినదాన్ని 26 శాతం మాత్రమే గుర్తిస్తుంది. మనుషులు కరెక్ట్ విషయం రాసినా తప్పు అని తొమ్మిది శాతం చెప్తోంది. దాంతో ఆ టూల్ని షట్ డౌన్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దానిలో లోపాలు గుర్తించి మరింత డెవలప్ చేయాలని భావిస్తున్నారట.