Artificial Intelligence: ఏఐతో జర్నలిస్ట్​లకు దెబ్బ?

Artificial Intelligence: ఏఐతో జర్నలిస్ట్​లకు దెబ్బ?

గూగుల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్​ని టెస్ట్​ చేస్తోంది. ఈ టూల్ సక్సెస్ అయితే జర్నలిస్ట్​లకు ప్రమాదం అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఇప్పటికే ఇండియాలో రోబో యాంకర్​తో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ టూల్​ వాడకంలోకి వస్తే జర్నలిస్ట్​లు రాసే వార్తల్ని కూడా రాసేస్తుంది.  ‘జెనెసిస్’ పేరుతో కథనాలు, వార్తలు రాసేలా ఈ టూల్​ని డెవలప్​ చేస్తోంది. రోజూవారీ వార్తలకు సంబంధించిన కంటెంట్​ను ఈజీగా అందిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోల్లో కల్పితాలు అనేవే ఉండవు అంటున్నారు. ఈ టూల్​ వల్ల టైం సేవ్ అవుతుంది. వార్తల్లో వివాదాస్పద, హానికర కంటెంట్​ లేకుండా జెనెసిస్ సాయపడుతుంది అంటున్నారు కంపెనీ ప్రతినిధులు. టైంకి డాటా ఆధారంగా రిపోర్ట్​లు డెవలప్​ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. 

ఎస్​ఈఓ టూల్​కి కూడా ఉపయోగపడుతుంది. న్యూస్ పబ్లిషర్స్​తో పార్ట్​నర్​గా ఉండేందుకు, చిన్న పబ్లిషర్లకు సాయం చేసేందుకు ఏఐ టూల్స్ డెవలప్ చేస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి జేన్ క్రీడర్ తెలిపారు. వార్తలను అందించేటప్పుడు ట్రూత్​ వెరిఫికేషన్​ కోసం ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, రచనా శైలిని మెరుగుపరచడం, ప్రత్యామ్నాయాలను అందించడంలో సాయం చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంది. అవేంటంటే... గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ చాలా రోజుల నుంచి ఎకనామిక్​ రిపోర్ట్​ను డిజైన్​ చేయడానికి ఏఐ టూల్​ని వాడుతోంది. అయితే జర్నలిస్ట్​లు ప్రచురించే రిపోర్ట్​ల సంఖ్య కంటే ఏఐ డిజైన్ చేసే రిపోర్ట్​ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది. ఓపెన్ ఏఐ సంస్థ కూడా ఏఐ క్లాసిఫైర్స్​ అనే టూల్​ని డెవలప్ చేసింది. టీచర్లు స్టూడెంట్లకు ఇచ్చిన వర్క్​ వాళ్లు చేశారా? ఏఐ వాడారా? అనేది తెలుసుకునేందుకు తయారుచేసిన టూల్ ఇది. అయితే ఇది ఏఐ రాసినదాన్ని 26 శాతం మాత్రమే గుర్తిస్తుంది. మనుషులు కరెక్ట్​ విషయం రాసినా తప్పు అని తొమ్మిది శాతం చెప్తోంది. దాంతో ఆ టూల్​ని షట్ డౌన్​ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దానిలో లోపాలు గుర్తించి మరింత డెవలప్ చేయాలని భావిస్తున్నారట.