న్యూఢిల్లీ: ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్గా మరో ఐదేళ్లపాటు గోపాల్ విఠల్ను కొనసాగించాలన్న ప్రపోజల్ను కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నియామకం వర్తిస్తుంది. ఇటీవలి యాన్యువల్ జనరల్ మీటింగ్లో (ఏజీఎం) 97 శాతం మంది షేర్హోల్డర్లు గోపాల్కు మద్దతుగా ఓట్లు వేశారు. ఈయనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దీనికి మద్దతుగా 89.57 శాతం ఓట్లు పడ్డాయి. ఈ నెల 12న కంపెనీ ఏజీఎం జరిగింది. ‘‘గోపాల్ను తిరిగి ఎండీగా కొనసాగించడానికి షేర్హోల్డర్లు ఒప్పుకున్నారు. ఆయన రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సి ఉంటుంది. సీఈఓగానూ పనిచేస్తారు.
గోపాల్ 2018 ఫిబ్రవరి నుంచి కంపెనీ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు” అని ఏజీఎం నోటీసు పేర్కొంది. ఈయనకు సంవత్సరానికి రూ.9.6 కోట్ల చొప్పున జీతం ఇవ్వడానికి షేర్హోల్డర్లు అంగీకరించారు. తదనంతర సంవత్సరాల్లో జీతంలో 15 శాతం వరకు ఇంక్రిమెంటు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిశాక పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్గా రూ.6.2 కోట్ల వరకు ఇస్తారు. ఇది మొత్తం జీతంలో 90 శాతం మించకుండా చూస్తారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో గోపాల్కు రూ.9.1 కోట్ల జీతం ఇచ్చారు. ఎయిర్టెల్ ప్రస్తుత నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుందని, 2024 మార్చి నాటికి భారతదేశంలోని అన్ని పట్టణాలను, ముఖ్య గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుందని విఠల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 3.5 గిగాహెజ్, 26 గిగాహెజ్ బ్యాండ్లలో 19,867.8 మెగాహెజ్ ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేసింది. మొత్తం రూ.43,040 కోట్లతో లో , మిడ్ -బ్యాండ్ స్పెక్ట్రమ్లో రేడియోవేవ్లను దక్కించుకుంది. ఫలితంగా దేశమంతటా 5జీ సేవలను అందించగలుగుతుంది.
