కర్ణాటకలో శ్రీ ధర్మరాయ స్వామి ఆలయంలో వార్షిక కరగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ధర్మరాయ స్వామి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో జరిగే ఈ వార్షిక కరగ ఉత్సవం 800 సంవత్సరాలుగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఒక పూజారి స్త్రీ వేషాధారణలో ఊరేగింపునకు నాయకత్వం వహిస్తాడు. ధ్వజారోహణంతో 11వ రోజు వసంతోత్సవ ఉత్సవాలు ముగుస్తాయి.
