వార్షిక  కరగ ఉత్సవాలకు 800ల చరిత్ర

 వార్షిక  కరగ ఉత్సవాలకు  800ల చరిత్ర

కర్ణాటకలో శ్రీ ధర్మరాయ స్వామి  ఆలయంలో  వార్షిక కరగ  ఉత్సవాలను  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భక్తులు  భారీ సంఖ్యలో  హాజరయ్యారు. ధర్మరాయ స్వామి  ఆలయంలో  ప్రతి ఏటా చైత్రమాసంలో జరిగే  ఈ వార్షిక  కరగ ఉత్సవం  800 సంవత్సరాలుగా  కొనసాగుతోందని  అధికారులు చెప్పారు.  ఒక పూజారి స్త్రీ వేషాధారణలో  ఊరేగింపునకు  నాయకత్వం వహిస్తాడు.  ధ్వజారోహణంతో  11వ రోజు  వసంతోత్సవ  ఉత్సవాలు ముగుస్తాయి.