హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్లకు వచ్చే ఏడాది ఏప్రిల్ 7–16 వరకు యాన్యువల్ ఎగ్జామ్స్నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్విడుదల చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. 8వ తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే 8న జనరల్ సైన్స్ పేపర్–1 ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, 16న ఇంగ్లిష్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. ఇక 9వ తరగతికి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పేపర్–1 ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం12:45 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 వరకు నిర్వహించనున్నారు. అలాగే16న సెకండ్లాంగ్వేజీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. 18న రిజల్ట్స్ ప్రకటించాలని, 20న పేరెంట్స్తో సమావేశం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. అదే విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి మార్చి 25 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.
