మరీ ఇంత దారుణమా : స్టూడెంట్లతో సెప్టిక్ ​ట్యాంక్ ​క్లీన్​

మరీ ఇంత దారుణమా : స్టూడెంట్లతో సెప్టిక్ ​ట్యాంక్ ​క్లీన్​
  • స్టూడెంట్లతో సెప్టిక్ ​ట్యాంక్ ​క్లీన్​
  • కర్నాటకలో రెసిడెన్షియల్​ స్కూల్​ టీచర్ల నిర్వాకం
  • సోషల్​ మీడియాలో వీడియో వైరల్
  • సీఎం సీరియస్.. ప్రిన్సిపాల్​పై వేటు
  • విచారణకు ఆదేశించిన అధికారులు

కోలార్: స్కూల్‌‌లో విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్‌‌ ను క్లీన్ చేయించిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూలులో విద్యార్థులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న వీడియో సోషల్ ​మీడియాలో వైరల్ అయింది. ఈ స్కూలులో 250 మందికి పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వీరిలో 8,9, టెన్త్​క్లాస్​లకు చెందిన కొద్దిమంది పిల్లలతో స్కూల్ ప్రిన్సిపాల్, కొందరు టీచర్లు బడి ఆవరణలోని సెప్టిక్​ ట్యాంక్​ శుభ్రం చేయించారు. విద్యార్థులకు పనిష్మెంట్​గా ఈ పనులు చేయించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 

దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ ​వెల్​ఫేర్​ మినిస్టర్​  మహదేవప్పను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి మహదేవప్ప వెంటనే ప్రిన్సిపాల్, వార్డెన్, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే స్కూల్​లోని కాంట్రాక్ట్ ఔట్​సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు.

ప్రిన్సిపాల్​సహా ఈ ఘటనకు బాధ్యులైన అందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని సోషల్​ వెల్​ఫేర్ జాయింట్ డైరెక్టర్ ఆర్.శ్రీనివాస్​ తెలిపారు. సోషల్ వెల్​ఫేర్ ఆఫీసర్ల కంప్లైంట్​తో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.