నేను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నా.. చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ

తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన రాజమండ్రి జైలులో 43 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. ప్రజల నుంచి ఒక్క క్షణం కూడా నన్నెవరూ దూరం చేయలేరని చంద్రబాబు వెల్లడించారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటున్న విలువలు, విశ్వసనీయతను చెరపలేరని ఆయన పేర్కొన్నారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తోంది.. త్వరలోనే బయటకొస్తానని చెప్పారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తాని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఓటమి భయంతోనే జైలులో ఉంచి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. ఈ చీకట్లు తాత్కాలికమే.. త్వరలోనే కారుమబ్బులు వీడతాయన్నారు. త్వరలో బయటకు వచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని చంద్రబాబు తెలిపారు.

Also Read : ఏడాది తరువాత బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్


ములాఖత్ భాగంగా తనను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఈ ఈ లేఖ ఇచ్చి పంపారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే ప్రజల సంకల్పంలో తాను ఉన్నానని పేర్కొన్నారు. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజాజీవితం తన కళ్లముందు కదలాడుతుందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానమంతా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందనన ఆయన తాను మీ మధ్య తిరగలేకపోవచ్చు కానీ, అభివృద్ధి రూపంలో కనిపిస్తానని పేర్కొన్నారు.


ఈ చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి అని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్న ఆయన జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవని అన్నారు. తాను తప్పు చేయనని, చేయనివ్వనని ఆయన తెలిపారు. ఈ దసరాకి మ్యానిఫేస్టోను విడుదల చేస్తానని మహానాడులో ప్రకటించానని, త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మ్యానిఫేస్టోను విడుదల చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నడూ బయటకు రాని తన కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చేలా చేశారని ఆయన తెలిపారు.