దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఏపీలోని అనంతపురంలో తయారు చేసిన ఎస్యూవీ ‘సెల్టోస్’ను కంపెనీ తెలంగాణ మార్కెట్లోకి శనివారం విడుదల చేసింది. హైదరాబాద్లోని విహాన్ ఆటో షోరూంలో జరిగిన కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర రావు కారును ఆవిష్కరించారు. తొలిరోజే 6,046 బుకింగ్స్ వచ్చాయని, రూ.25 వేల టోకెన్ అమౌంట్తో బుకింగ్స్ తీసుకుంటున్నామని షోరూం నిర్వాహకులు చెప్పారు.
