5 వేల వజ్రాలతో రామమందిరం నెక్లెస్.. రామయ్యకు సూరత్ వ్యాపారి గిఫ్ట్

5 వేల వజ్రాలతో  రామమందిరం నెక్లెస్.. రామయ్యకు సూరత్ వ్యాపారి గిఫ్ట్

ఉత్తర ప్రదేశ్ లో నిర్మించిన అయోధ్య రామ మందిరం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.  ఈ  ప్రారంభోత్సవానికి దాదాపు  నెల ముందే గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం ఇతివృత్తంపై ఒక వజ్రాల హారం తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఇది ఎంతగానే ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉండే  డైమండ్ నెక్లెస్ కు  2 కిలోల వెండితో పాటు  ఈ నెక్లెస్ డిజైన్‌లో 5 వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించారు. ఈ నెక్లెస్ లో   రాముడు, లక్షణుడు, సీత,హనుమాన్ లను కూడా చూడొచ్చు. ఈ డిజైన్‌ను 40 మంది కళాకారులు  35 రోజుల్లో పూర్తి చేశారు.  ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదు... తాము దానిని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము అని వజ్రాల వ్యాపారి చెప్పాడు. 

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వచ్చే ఏడాది జనవరి 22న  ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా నిర్ణయించారు.  ఈ మహాక్రతువు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి  పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.  ఈ క్రమంలో  అయోధ్యకు మొదటి వంద రోజుల్లో 1,000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.  ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.