- ఢిల్లీకి వెళ్లి అడ్వకేట్లతో మాట్లాడిన కేటీఆర్, హరీశ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తిహార్ జైల్లో ఉంటున్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్), ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 7న ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గతంలో రెండుసార్లు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా, కవిత బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరఫు అడ్వకేట్లతో వారు భేటీ అయ్యారు.