మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2014 లో క్యాష్ ఫర్ జాబ్స్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు లేటెస్ట్ గా బెయిల్ వచ్చింది.
2014లో రవాణాశాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పి్స్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బుల వసూలు చేశారనే ఆరోపణలు చేసింది ఈడీ. 2015 జూన్ 14న ఈడీ ఆయనను అరెస్ట్ చేయడంతో ఎఐఎడిఎంకె ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పదవి నుంచి తొలగించింది.
ఆగస్ట్ 12, 2018న, బాలాజీపైఈడీ 3 వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అక్టోబరు 19న బాలాజీ గతంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు చేసింది.