గత రెండు రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(బుధవారం) లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సూచీలు ఇవాళ లాభాలను ముందుండి నడిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 31,686కి పెరిగింది. నిప్టీ 66 పాయింట్లు పుంజుకుని 9,271 దగ్గర స్థిరపడింది.

