న్యూఢిల్లీ: ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ ఐపీఓ మంగళవారం ఓపెన్ కానుంది. గురువారం ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.200–210 రేంజ్లో అందుబాటులో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్లో సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ను ఈ కంపెనీ చేపడుతోంది.
కొండ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ను చేపట్టడంలో కంపెనీకి అనుభవం ఉంది. ఈ ఐపీఓలో కనీసం 70 షేర్ల కోసం బిడ్స్ వేయాలి. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.1,199.31 కోట్లుగా ఉంది.
