తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలం

తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలం
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలంరేపింది. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఘటన స్థలంలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది.. పామును ప్లాస్టిక్ బకెట్ తో కప్పేశారు. ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని… అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది… బకెట్ కింద ఉన్న పామును సంచిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.