
పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలున్నా, పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, కష్టాల కొలిమి తాండవిస్తున్న ఈ రోజు (జూన్ 24)న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈయన జన్మించిన రోజే కుమారషష్టి. అది ఈ ఏడాది జూన్ 24 శనివారం వచ్చింది. ఈ రోజు ఏం చేయాలంటే...
ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆరవ రోజున కుమార షష్ఠి లేదా స్కంద షష్టిని జరుపుకుంటారు. కుమార స్వామితో పాటు శివుడు పార్వతీదేవిని కూడా ఈ రోజున (జూన్24) పూజించాలి. కార్తికేయుడిని కుమారస్వామి, సుబ్రహ్మణ్యం వంటి పేర్లతో పిలుస్తారు. ఈ రోజున(జూన్ 24) భక్తులు కుమారస్వామికి గంధం,కుంకుమ,ధూపం, పువ్వులు, పండ్లు సమర్పిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. షష్టి తిథిని పంచమి తిథితో కలిపిన కాలవ్యవధిని భక్తులు ఉపవాసం ఉండాలి...అంటే పంచమి మొదటి నుంచి షష్ఠి తిథి వరకు వుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు.
స్కంద షష్ఠి అని కూడా పిలువబడే కుమార షష్టి అనేది శివుడు పార్వతి దేవి కుమారుడైన కార్తికేయకు అంకితం చేయబడిన ముఖ్యమైన హిందూ పండుగ. కార్తికేయ భగవానుడు కుమార్, మురుగ,సుబ్రహ్మణ్య వంటి వివిధ పేర్లతో పూజించబడతాడు కాబట్టి కుమార్ షష్ఠి అని పేరు. హిందూ క్యాలెండర్లో ఆషాఢ నెలలో శుక్ల పక్షం (చంద్రుని ప్రకాశవంతమైన పక్షం) సమయంలో షష్ఠి (6వ రోజు) నాడు కుమార షష్ఠి పాటిస్తారు.
స్కంద షష్ఠి తిథి ,శుభ సమయం..
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి ప్రారంభం - జూన్ 23 శుక్రవారం రాత్రి 7:54 నిమిషాలకు
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి సమాప్తం - జూన్ 23 శనివారం రాత్రి 10:17నిమిషాలకు
ఇకపోతే.. కుమార స్వామిని పూజించిన తర్వాత స్కంద షష్టి కవచం, సుబ్రహ్మణ్య భుజంగం లేదా సుబ్రహ్మణ్య పురాణం అని జపించడం మంచిది. కుమార షష్ఠి కార్తికేయుడి జయంతిని సూచిస్తుంది. రాక్షసుల అధర్మాన్ని ఓడించడానికి ఈ రోజున దేవతల సేనాధిపతిగా కుమారస్వామి అవతరించాడని నమ్ముతారు. అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు కుమార స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వ దినాలుగా జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోషనివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని వేద పండితులు చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల వారు ఇంటి ముందు భాగంలో ఆవు పేడ మరియు ఎర్రమట్టిని ఉపయోగించి ఒక వృత్తాన్ని గీస్తారు. భక్తులు ఈ రోజున కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. సాయంత్రం కార్తికేయ ఆలయాన్ని సందర్శించే వరకు ఉపవాస నియమాన్ని పాటిస్తారు. భగవంతుని ప్రార్ధన చేసిన తర్వాత మాత్రమే వ్రతం పూర్తి అవుతుంది. కొద్దిమంది భక్తులు మధ్యాహ్న సమయంలో ఒకపూట భోజనం చేస్తే... కొందరు రాత్రిపూట భోజనం చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు. భక్తులు అన్ని రాక్షస గుణాల నుండి విముక్తి పొందాలని .. మానసికంగా ,ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి కుమారుడిని ప్రార్థిస్తారు.
కుమార్ షష్టి యొక్క ప్రాముఖ్యత
కుమార షష్ఠి యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో వివరించబడింది. కుమార్ షష్టి భగవాన్ కార్తికేయ జన్మదినాన్ని జరుపుకుంటుంది. దీనిని కుమార్ జయంతి అని కూడా పిలుస్తారు. హిందూ పురాణ వాస్తవాల ప్రకారం, కార్తికేయుడు రాక్షసులను నాశనం చేసేవాడు. అందువల్ల హిందూ భక్తులు కార్తికేయుడిని పూజిస్తారు .కుమార షష్ఠి వ్రతాన్ని ఆచరించిన వారి కష్టాలు తొలగిపోయి.. వారి కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు. భక్తులు అన్ని రాక్షస గుణాల నుండి విముక్తి పొందాలని మరియు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి కుమారుడిని ప్రార్థిస్తారు. ఇకపోతే కుమార షష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, దంపతుల మధ్య అన్యోన్యత, వ్యాపారాభివృద్ధి ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.