హైదరాబాద్, వెలుగు : షార్ట్ న్యూస్ యాప్ వే2న్యూస్కు రూ. 130 కోట్ల ఫండింగ్వచ్చింది. ప్రాంతీయ భాషలలో షార్ట్ ఫార్మాట్లో న్యూస్ అందిస్తున్న ఈ కంపెనీలో వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్, వెంచర్ క్యాపిటలిస్ట్ శశి రెడ్డిలు ఏ సిరీస్రౌండ్ కింద ఈ పెట్టుబడి పెట్టారు. మన దేశంలో మీడియా, ఎంటర్టెయిన్మెంట్ రంగంలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారని వే2న్యూస్ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు, ఎడిటోరియల్, సేల్స్, ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు ఈ డబ్బు వాడుకోనున్నట్లు పేర్కొంది. న్యూస్ డెలివరీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకాన్ని మరింతగా పెంచనున్నట్లు వే2న్యూస్వెల్లడించింది. చిన్న పట్టణాలు, గ్రామాల న్యూస్ను సైతం ఇచ్చే ప్రయత్నంలో సక్సెసయినట్లు వివరించింది. తమ మొబైల్ ఫస్ట్న్యూస్ ప్లాట్ఫామ్ భవిష్యత్లో మరింతగా చొచ్చుకుపోయే అవకాశాలున్నాయని వే2న్యూస్ సీఈఓ రాజు వనపాల చెప్పారు. వే2న్యూస్ను పెద్ద వెర్నాకులర్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని వెల్లడించారు.
