- ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురి బలవన్మరణం
- గుజరాత్లోని సూరత్లో దారుణం
సూరత్: అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వసూలు కావట్లేదనే టెన్షన్ తో ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోని ముగ్గురు చిన్నపిల్లలకు విషం తాగించి కుటుంబ పెద్ద ఉరేసుకున్నాడు. సూరత్ లోని సిద్ధేశ్వర్ అపార్ట్ మెంట్ లో మనీశ్ సోలంకీ(37) కుటుంబం ఉంటోంది. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనీశ్తల్లిదండ్రులు కూడా ఆయనతో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో సోలంకీ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పక్క ఫ్లాట్ వాళ్లు పోలీసులకు సమాచా రం అందించారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగా.. లోపల చిన్నారులతో పాటు ముగ్గురు పెద్ద వాళ్లు నేలపై విగతజీవులుగా పడి ఉండడం కనిపించింది. ఆ పక్కనే మనీశ్ సోలంకీ డెడ్ బాడీ ఫ్యాన్కు వేలాడుతోంది. అక్కడున్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోలంకీ ఫ్యామిలీ మరణాలకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెప్పారు. ఇతరులకు అప్పిచ్చిన మొత్తం తిరిగి రాబట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు కాంట్రాక్టర్గా పనిచేస్తున్న సోలంకి చివరిలేఖలో రాశారు.
