కొత్త ఏజీగా ఆర్. వెంకటరమణి

కొత్త ఏజీగా ఆర్. వెంకటరమణి

ఎల్లుండి బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ:  కొత్త అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. వెంకటరమణి (72) నియమితులయ్యారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ నెల 30న రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు చేపడ్తారు. వెంకటరమణి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారని పేర్కొంటూ బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజుజు ఆఫీసు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంకటరమణి పుదుచ్చేరిలో 1950, ఏప్రిల్ 13న జన్మించారు. తమిళనాడు బార్ కౌన్సిల్ లో 1977లో లాయర్​గా రిజిస్టర్ అయ్యారు. ఆయన 1979లో సుప్రీంకోర్టు లాయర్​గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2010 నుంచి 2013 వరకు ఆయన లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా పని చేశారు.