సయంట్ చేతికి సెల్ఫీనెట్​

సయంట్ చేతికి సెల్ఫీనెట్​
  • డీల్​ విలువ రూ.340 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: సిటీకి చెందిన ఐటీ సొల్యూషన్స్​ ప్రొవైడర్​ సయంట్​ పోర్చుగల్​కు చెందిన వైర్​లెస్​ ఇంజనీరింగ్​ సర్వీస్​ ఫర్మ్​ సెల్ఫీనెట్​ను చేజిక్కించుకోనుంది. ఈ క్యాష్​ డీల్​ విలువ 41 మిలియన్​ యూరోలని (దాదాపు రూ.340 కోట్లు) కంపెనీ వెల్లడించింది. దీనివల్ల వైర్​లెస్​ ఇంజనీరింగ్​ సెగ్మెంట్​బలోపేతమవుతుందని, కమ్యూనికేషన్​ సర్వీస్​ ప్రొవైడర్లకు మరింత మెరుగ్గా సేవలను అందించవచ్చని సయంట్​ తెలిపింది. ఎంటర్​ప్రైజ్​లకు నెట్​వర్క్​ సదుపాయాన్ని సమకూర్చవచ్చని పేర్కొంది. ఈ డీల్​ప్రకారం సయంట్​ సెల్ఫీనెట్​కు ముందుగా 65 శాతం డబ్బును చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని రెండేళ్లలో సర్దుబాటు చేస్తుంది. కొనుగోలు పనులు ఈ నెల 20లోపు పూర్తవుతాయి. సెల్ఫీనెట్​ తమ చేతికి రావడం వల్ల తమ 5జీ టెక్నాలజీలు మరింత మెరుగవుతాయని సయంట్​ ఎండీ, సీఈఓ బోదనపు కృష్ణ చెప్పారు. పోర్చుగల్​లో ట్యాలెంట్​కు కొరత లేదు కాబట్టి స్ట్రాటెజిక్​ ఇనోవేషన్​ హబ్​ అవుతుందని వివరించారు. ఇక నుంచి యూరప్​ దేశాల్లో తమకు మరిన్ని వ్యాపార అవకాశాలు వస్తాయని, నార్త్​ అమెరికా, ఆస్ట్రేలియాలో వ్యాపారం పెరుగుతుందని కృష్ణ చెప్పారు.