విశాఖ మన్యంలో వరుసగా రెండోరోజు కాల్పుల మోత కొనసాగింది. పట్నం రూరల్ జిల్లా గాలికొండ- పెద్దబైలు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ లకు, గ్రే హౌండ్స్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఒక ఏకే 47 సహా అయిదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేతలు ఘటనా స్థలంలో వున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
