తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్

తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్
కేరళలో బడులు తెరుచుకున్నయ్​ తిరువనంతపురం: దాదాపు తొమ్మిది నెలల తరువాత కేరళ బడులు జనవరి 1 నుంచి ఓపెన్​ అయ్యాయి. స్టూడెంట్స్​కు కరోనా సోకకుండా రూల్స్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోవడడం, తరచూ చేతులు కడుక్కోవడం, సోషల్​ డిస్టెన్సింగ్​ రూల్స్​ పాటించడం తప్పనిసరి చేశారు. బడిలోకి ఎంటర్​ కాగానే టెంపరేచర్​ చెక్​ చేస్తున్నారు. పేరెంట్స్​నుంచి అనుమతి పత్రం తీసుకొస్తేనే క్లాసులోకి అనుమతిస్తున్నారు. ఇప్పుడు 10,12 క్లాసుల స్టూడెంట్స్​కు మాత్రమే కొన్ని గంటలపాటు పాఠాలు చెబుతున్నారు. చాలా నెలల తరువాత ఫ్రెండ్స్​ను, టీచర్స్​ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందంటూ 12వ తరగతి స్టూడెంట్​ అఖిల చెప్పింది. ఆన్​లైన్​ క్లాసులు బోర్​ కొడుతున్నాయని, స్కూలుకు రావడమే బాగుందని మరో స్టూడెంట్​ పార్వతి వివరించింది. For More News.. వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్ స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా ఆక్సిడెంట్.. ఇద్దరు మృతి సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత