తమిళనాడులోని చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టబడ్డాయి. మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న చెన్నై పోర్టు అధికారులు. ఆస్ట్రేలియాకు వెళ్లిే కార్గో షిప్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రయత్నంచినందుకు చెన్నైకి చెందిన ఇద్దరు కార్గో షిఫ్ ఏజెంట్లు అబుతాహిర్(30), అహ్మద్ భాషా (35) లను అరెస్ట్ చేశారు. ఇందులో అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
స్వాధీనం చేసుకున్న ఎఫిడ్రిన్ మెథాంఫేటమిన్ తయారీకి ఉపయోగించబడుతుందని గుర్తించారు. భారీ మొత్తం డ్రగ్స్ అక్రమ రవాణాపై విచారణ సాగుతోంది. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.