హైదరాబాద్, వెలుగు: లైఫ్సైన్సెస్, సెమీకండక్టర్ కంపెనీలకు రెవెన్యూ ఆప్టిమైజేషన్, కాంప్లయన్సెస్ సాఫ్ట్వేర్లు తయారు చేసే అమెరికా కంపెనీ మోడల్ ఎన్ హైదరాబాద్లో తన ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. 70 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన మోడల్ ఎన్ ఫెసిలిటీలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మోడల్ ఎన్ ప్రెసిడెంట్ & సీఈఓ జేసన్ బ్లెస్సింగ్ దీనిని ప్రారంభించారు. హైదరాబాద్లోని మోడల్ ఎన్ సెంటర్ కొత్త ప్రొడక్ట్ ఇన్నోవేషన్లను మార్కెట్లోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. స్టేట్ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ మేనేజ్మెంట్, 340 బీ సొల్యూషన్స్ ఫార్మా కంపెనీలకు ఉపయోగపడతాయి.
ఫ్లూయిడ్ డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్లో వీటిని వాడుతారు. ఆపరేషన్స్ను సక్రమంగా నిర్వహించేలా చేయడమేగాక, రిస్కులను తగ్గిస్తాయి. -ప్రస్తుతం టాప్ 30 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ బ్రాండ్లలో 28 కంపెనీలతో కలిసి మోడల్ ఎన్ పనిచేస్తోంది. 20 గ్లోబల్ సెమీకండక్టర్ బ్రాండ్లలో 14 కంపెనీలకు సేవలు అందిస్తున్నది. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్లో 800 ఫార్మా కంపెనీలు, 28 వరకు సెమీ కండక్టర్ కంపెనీలు ఉన్నాయన్నారు. స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఓఈఎంలు, థింక్ ట్యాంక్లు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను ఆకర్షించగల సామర్థ్యం మోడల్ ఎన్కు ఉందన్నారు.
