ఆళ్ళగడ్డ చాగలమర్రి జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా కరీంనగర్, సిద్దిపేట్ జిల్లాలకు చెందిన వారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సిద్ధిపేట్ నుంచి వీరు బయలు దేరారు. మహానందిని దర్శించుకుని కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి వెళ్తుండగా టైర్ పగిలి బస్సు బోల్తాపడింది. దీంతో వేగంగా స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
