టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. కోచ్ పదవి కోసం కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కొత్త భారత జట్టు కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. కోచ్ కోసం వచ్చిన దరఖాస్తులను వడపోసి ఆరుగురితో షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. ఈ ఆరుగురిలో ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుత్ ఉన్నారు. అయితే తమ ప్రథమ ప్రాధాన్యం మాత్రం భారత్ కు చెందిన కోచ్ కేనని కపిల్ స్పష్టం చేస్తున్నారు.
