ఎన్సీపీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్​ రద్దు

ఎన్సీపీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్​ రద్దు
  • విద్యార్థి, మహిళా, యూత్​ వింగ్​లకు మినహాయింపు
  • పవార్​ నిర్ణయాన్ని  ప్రకటించిన ప్రఫుల్​ పటేల్​

ముంబై: నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన అన్ని విభాగాలను, సెల్స్​ను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ జనరల్​ సెక్రటరీ ప్రఫుల్​ పటేల్​ ప్రకటించారు. పార్టీ నేషనల్​ ప్రెసిడెంట్​ శరద్​ పవార్ అప్రూవల్​తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. విద్యార్థి, మహిళా, యూత్​ విభాగాలకు రద్దు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు వివరించారు. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై మాత్రం ప్రఫుల్ పటేల్​ క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్రలో మహా వికాస్​ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం కూలిపోయిన మూడు వారాల తరువాత.. ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. బాల్​థాక్రే నేతృత్వంలో ఏర్పడిన ఎంవీఏ సర్కార్​లో ఎన్సీపీ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత శివసేన రెబల్​ ఎమ్మెల్యే ఏక్​నాథ్​ షిండే శాసన సభ్యుల మద్దతు కూడగట్టుకుని బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.