మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..క్రికెటర్ పై మూడేళ్ల పాటు నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..క్రికెటర్ పై మూడేళ్ల పాటు నిషేధం

పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై మూడేళ్ల పాటు వేటు పడింది.

ఫిక్సింగ్​ కోసం సంప్రదింపులు జరిగినా తమకు ఫిర్యాదు చేయకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు(పీసీబీ)  అక్మల్​ పై వేటు వేసింది . ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన పాకిస్థాన్ సూపర్ లీగ్​(పీఎస్​ఎల్​) ప్రారంభం అవడానికి కొద్ది గంటల ముందే  అక్మల్​ను పీసీబీ సస్పెండ్ చేసింది. విచారణ జరిపి గత నెల 17న పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతడిపై అభియోగాలను నమోదు చేసింది. వీటిపై అక్మల్​ అప్పీలు కూడా చేసుకోలేదు. దీంతో పీసీబీ డిసిప్లెనరీ ప్యానెల్​ ​ ఉమర్ అక్మల్​పై మూడేండ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

అక్మల్  కెరీర్​లో ఆట కంటే వివాదాల కారణంగా అక్మల్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాహోర్​లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్​నెస్ ట్రైనర్​తోనూ అక్మల్​ అసభ్యకరంగా ప్రవర్తించాడు.