న్యూఢిల్లీ: క్విక్ డెలివరీ (ఓలా డ్యాష్)తోపాటు పాతకార్ల బిజినెస్ (ఓలా కార్స్)లను మూసేస్తున్నామని ఓలా ప్రకటించింది. కరెంటు బండ్లు, మొబిలిటీ బిజినెస్లపై మరింత ఫోకస్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. క్యాబ్ బిజినెస్ చాలా బాగుందని, ఓలా ఈవీల వల్ల ఇండియాలోనే అతిపెద్ద ఈవీ కంపెనీగా ఎదిగామని ప్రకటించింది. ఇప్పటి వరకు 50 కోట్ల మందికి మొబిలిటీ సర్వీసులు అందించామని కంపెనీ స్పోక్స్పర్సన్ చెప్పారు. ఓలా కార్స్ను కిందటి ఏడాది అక్టోబరులోనే ఏర్పాటు చేశారు. డ్యాష్ స్లోర్లలో పనిచేసే 2,100 మందిని ఈ ఏడాది ఏప్రిల్లో తీసేశారు. ఓలా కేఫ్స్పేరుతో 2015లో మొదలుపెట్టిన ఫుడ్బిజినెస్ను కూడా ఏడాది తరువాత తొలగించింది. ఫుడ్ఫాండాను కూడా 2019లో మూసేసింది.
