దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.MBBS,BDS కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (NEET) నిర్వహించింది. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హాజరయ్యారు.
కరోనా కారణంగా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్ 13న కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేక పోయిన విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను http://ntaneet.nic.in వెబ్సైట్ ద్వారా అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
ఈ ఏడాది నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్లతో పాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు.
