చిత్రా రామక్రిష్ణకు ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీ

చిత్రా రామక్రిష్ణకు ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీ

ముంబై: ఎన్​ఎస్​ఈ మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ చిత్రా రామక్రిష్ణకు ఏడు రోజులపాటు సీబీఐ కస్టడీకి పంపాలని సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో లొకేషన్​ స్కాములో భాగం ఉందనే ఆరోపణలతో ఆదివారం రాత్రి చిత్రా రామక్రిష్ణను అరెస్టు చేశారు. అడిగే ప్రశ్నలకు చిత్రా రామక్రిష్ణ జవాబులు దాటవేస్తుండటంతో 14 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ కోరింది. ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామని ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. నాలుగేళ్లలో ఇద్దరు నిందితులను మాత్రమే అరెస్టు చేయడంపైనా కోర్టు ఆరా తీసింది. దాదాపు 2,500 ఈమెయిల్స్​ దాకా ఉన్నాయని, వీటిపై వివరాలు తెలుసుకోవడానికి చిత్రా రామక్రిష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ తరఫు లాయర్​ కోరారు. చిత్రా రామక్రిష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్​ అప్లికేషన్​ను శనివారం నాడు కోర్టు తిరస్కరించింది.