పెళ్లిపీటల మీది నుంచి వచ్చి.. రక్తదానం చేసిన్రు.. ప్రాణం పోసిన్రు

పెళ్లిపీటల మీది నుంచి వచ్చి.. రక్తదానం చేసిన్రు.. ప్రాణం పోసిన్రు

లక్నో: ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నరు డాక్టర్లు.. టైమ్​కు డోనర్లేమో దొరకలే. ఏంచేయాల్నా అని అమ్మాయి పేరెంట్స్​ తండ్లాడుతుం టే ఓ జంట ముందుకొచ్చింది. పెండ్లి పీటల మీదినుంచి నేరుగా ఆస్పత్రికి చేరుకుంది. రక్తం ఇచ్చాక మంటపానికి తిరిగెళ్లింది. ఉత్తరప్రదేశ్​లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను అక్కడి పోలీస్​ కమిషనర్​ ఆశిష్​ మిశ్రా ట్విట్టర్​లో షేర్​ చేశారు. దీంతో నెట్టింట్లో ఆ ఫొటో వైరల్​ అయింది. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఈ జంట వివరాలను మిశ్రా వెల్లడించలేదు.