24న ద్రౌపది ముర్ము నామినేషన్

24న ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి  ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలను, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఆహ్వానించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో ఇప్పటికే నిర్ధారించారని కథనాలు పేర్కొన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా దీనికి హాజరవుతారని అంటున్నారు.